రాంరళీయం-పద్యములు -తొలి అయిదు ప్రసూనములు.
కం|| శ్రీ గణ నాథుని తొల్లిని
వాగీశ్వరి వాణి సిథ్థి వడయ ,మలిని - నే
వేగము షడ్వేద రవళి
మోగగ జేయగ నుతింతు మోహన మురళీ||-1.
కం|| తొలుత గణపతిని విఘ్నము
తొలగ ; తదుపరి నిక వాణి తోడుగ దైవం
బుల నందర కొలిచి విషయ
ముల దెల్పెద వివరముగ నీకు మోహన మురళీ|| -2.
కం|| శ్రీ మద్భగవద్గీతను
నే మహనీయుడు జనులకు నెఱుక బరచెనో
ఆ మహనీయుని దలవగ
మోమును జూపర ముకుంద మోహన మురళీ || (3)
కం|| తల్లి అన సూయ కోరగ
తొల్లి,మువురు దైవములును తుదకు కలిసిరా
తల్లి కడుపున పుటుక కై
ముల్లె మనకు ధారవోయ మోహన మురళీ || (4)
కం|| ఆ మువ్వురు మూర్తులె;మని
షై మహినిజనించిలనరి షడ్వర్గమ్ముల్
కామ పిశాచాదులబడి
మోమాటుల నుద్ధరింప మోహన మురళీ|| (5)
అటువంటి గురు దేవులైన శ్రీ గురు దత్తాత్రేయుని మనసులో స్మరించి,మాన వాళి సవ్య మైన మార్గం నడిచేటందుకు వీలుగా,ఆయన తన వాక్సిథ్థిని నాకు అందించి నన్నీ వేద రచనను సవ్యంగా పూర్తి చేయించ మని కోరి ప్రార్థిస్తూ మొదలు పెడ్తున్నాను. నా ఈ కావ్యానికి ముందు నా వంశానుక్రమణికను తెలియ బరుచుకుంటున్నాను.