రాంరళీయ షడ్వేదం చతుర్థ దివస పంచ ప్రసూనములు!
మిస మిస వయసున లలనల
ఇసురిసురని పొంద గోరి ఇటునటులైతిన్
రుస రుస లాడక నను నీ
ముసి ముసి నగవుల దనర్చు మోహన మురళీ!(16)
తప్పులవిచేస్తిని యపుడు
ఇప్పట్టున పట్టు వీడి యిట్లైతినిరా
ముప్పది నికరానున్నది
ముప్పు తప్పింపగదవె మోహన మురళీ!(17)
లోకము మెచ్చంగ వలెను
మా,కరదీపిక యితండు మాత్రమె యనుచున్
ఏ కరణి మనిషి బతికిన
మోకరిలు జనములు చెపుమ మోహన మురళీ! (18)
జగదేక వంద్యు నెప్పుడు
భగవంతునిగా తలంతు భయ నాశముకై
ఖగవాహనునిక కొలిచెద
మొగమును చూపర ముకుంద మోహన మురళీ! (19)
పరిపూర్ణత పొందుట యని
తరసాధ్యంబెవెనికైన తామెలకువతో
నిరతము చదివిన శాస్త్ర
మ్ము,రయమున పెరుగును గాన మోహన మురళీ!(20)
-
రాంరళీయ షడ్వేదం చతుర్థ దివస పంచ ప్రసూనములు!
@ 2009-04-19 – 11:44:40
-
రాంరళీయ షడ్వేదం- తృతీయ దివస పంచ ప్రసూనములు
@ 2009-04-18 – 07:50:54
రాంరళీయ షడ్వేదం- తృతీయ దివస పంచ ప్రసూనములు.
నారాయణ యను నామము
పోరా!చేయకుర యనిన ఫో,పొమ్మనుచున్
కోరి వదలించుకోవలె
మోరమతనిది గనరాదు మోహన మురళీ!(11)సామాన్యులకును అనుభవ
మౌ,మాన్యత నిచ్చెడి పరమౌషధముర నీ
నామస్మరణంబెపుడును
మోమును చూపర ముకుంద మోహన మురళీ!(12)ఏదేవుని యే తలతునొ
నాదిక్కనియా ముకుందునకె యర్పింతున్
నాది యనునదేదయి నను
మోదము తోడ ముకుంద మోహన మురళీ!!(13)గతి నిర్దేశం బీవై
మతి మాలి గతి చెడెడి నను మలచగ నెపుడున్
అతిశీఘ్రముగను రావే!
ముతుక వయో వృద్ధుడైతి మోహన మురళీ!(14)అవ్వలనివ్వల కావలి
నివ్వగ ఆద్యంతమందు నీవే నాకున్
దివ్వెవు కావలె ముద్దుల
మువ్వలధారీ ముకుంద మోహన మురళీ! (15) -
రాంరళీయం-ద్వితీయ పంచ ప్రసూనములు.
@ 2009-04-17 – 12:28:47
రాంరళీయం-ద్వితీయ పంచ ప్రసూనములు.
థామము నీది విశాల
మ్మే!మాకును చోటు గలదు మిత్రమ యందున్
కామన ఇది నాది అరసి
మోమును చూపర ముకుంద మోహన మురళీ! (6)
ఏమని కొలిచిన నిన్నే
మేమని తలిచిన దయ గొని మీటెదవో యీ
నా, మనమును చెప్పగదే?!
మోమును చూపుచు ముకుంద మోహన మురళీ! (7)
కామితము దీర్పగరావ
దేమిర? నా ఈప్సితములవి శుభకరములౌ
టేమియు వింతర?! నీ నగు
మోమును గాంచగ ముకుంద మోహన మురళీ!(8)
మోమును గనకున్నను ఆ
రామము నా కేదిరా?విరామము నీయా
రామము నందుండుగదా?!
మోమును చూపవె ముకుంద మోహన మురళీ!(9)
మోమును గనకున్నను ఆ
రామము నా కేదిరా?విరామము నీయా
రామము నందుండుగదా?!
మోమును చూపవె ముకుంద మోహన మురళీ!(10) -
రాంరళీయం
@ 2009-04-16 – 11:41:04
రాంరళీయం-పద్యములు -తొలి అయిదు ప్రసూనములు.
కం|| శ్రీ గణ నాథుని తొల్లిని
వాగీశ్వరి వాణి సిథ్థి వడయ ,మలిని - నే
వేగము షడ్వేద రవళి
మోగగ జేయగ నుతింతు మోహన మురళీ||-1.
కం|| తొలుత గణపతిని విఘ్నము
తొలగ ; తదుపరి నిక వాణి తోడుగ దైవం
బుల నందర కొలిచి విషయ
ముల దెల్పెద వివరముగ నీకు మోహన మురళీ|| -2.
కం|| శ్రీ మద్భగవద్గీతను
నే మహనీయుడు జనులకు నెఱుక బరచెనో
ఆ మహనీయుని దలవగ
మోమును జూపర ముకుంద మోహన మురళీ || (3)
కం|| తల్లి అన సూయ కోరగ
తొల్లి,మువురు దైవములును తుదకు కలిసిరా
తల్లి కడుపున పుటుక కై
ముల్లె మనకు ధారవోయ మోహన మురళీ || (4)
కం|| ఆ మువ్వురు మూర్తులె;మని
షై మహినిజనించిలనరి షడ్వర్గమ్ముల్
కామ పిశాచాదులబడి
మోమాటుల నుద్ధరింప మోహన మురళీ|| (5)
అటువంటి గురు దేవులైన శ్రీ గురు దత్తాత్రేయుని మనసులో స్మరించి,మాన వాళి సవ్య మైన మార్గం నడిచేటందుకు వీలుగా,ఆయన తన వాక్సిథ్థిని నాకు అందించి నన్నీ వేద రచనను సవ్యంగా పూర్తి చేయించ మని కోరి ప్రార్థిస్తూ మొదలు పెడ్తున్నాను. నా ఈ కావ్యానికి ముందు నా వంశానుక్రమణికను తెలియ బరుచుకుంటున్నాను. -
రాంరళీయం-III
@ 2009-04-15 – 12:07:09
హిందువులు మనిషినీ ఇతర జీవ రాసులనన్నిటినీ దైవంగా భావిస్తారు. ఆకలితో వచ్చిన అతిథిని- (ఆకలితో వచ్చిన జంతువు నైనా) అతిథిని (తిథి-వారం నక్షత్రం లేకుండా వచ్చేవాడు అతిథి.)వానిని "అతిథి దేవో భవ!",అంటారు.వారు ఇంటికి అతిథి వస్తే,ముందు అతిథికి భోజనం (అన్న పానాదులు ) చూశాకే తాము భోజనం చేస్తారు.కుక్షింభరత్వంతో ఎవరైనా ఈ ధర్మాన్ని ఆచరించరనే అనుమానంతో,అతిథిని దైవ స్వరూపుడు అని చెప్పారు.ఇప్పటికి హిందువుల దైవాల లిస్టు ఇది అనుకుంటే రాను రాను ఆ లిస్టు పెరుగుతూ పోతుంది. 1.మాతృదేవోభవ.2.పితృదేవోభవ.3.ఆచార్య (గురు)దేవోభవ.4.అతిథి దేవోభవ.ఇవి కాక వారికి సత్యమన్నది దైవం! "సత్యం వద ",వారి సూక్తి.అసత్యమాడినందువల్ల జరిగే అనర్థాలగూర్చీ,అసత్య దోషం వల్ల అంటే పాపం గూర్చీ వారికి ఎన్నో కథలున్నాయి.ఏకంగా సత్య హరిశ్చంద్రుడని ఆయనపైన ఒక కథేవుంది.ఇన్ని చెప్పినా కొన్ని రాయితీలు కొన్ని అత్యవసర పరిస్థితుల్లో ఇచ్చారు.మాన-ప్రాణ -ధన హాని,వైవాహికములందు బొంకవచ్చునన్నారు. అయితే ఇటువంటి అబద్ధంకూడా,అనృత దోషాన్నించి తప్పించ లేదు. దానికి తగ్గ ప్రతిఫలం అనుభవించాల్సిందే! ఉ|| ధర్మ రాజు యుద్ధంలో "అశ్వత్థా మా హతః కుజరః" అన్నందుకు (కుంజరః అని మెల్లిగా అన్నందుకే ఒక సారి నరకం చూడాల్సిన గతి పట్టిందనే కథ వుంది.అలాగే- శివుని జటాజూటాన్ని బ్రహ్మ చూశాడని తలతో చెబుతూ తోకతో చూడ లేదని అబద్ధపు సాక్ష్యం యిచ్చినందుకు
ఆవుకు శాపం "ఉదయాన్నే ఆవు ముఖం చూస్తే పాపమనీ-తోక చూస్తే పుణ్యమనీ శివుడు ఇచ్చాడు. మొగలి పువ్వు అబద్ధమాడినందుకు పూజార్హతని కోల్పోయింది.ఇలాటి కథలు ప్రచారం చేసి,సత్యమేవ జయతే అని ఎవరూ అబద్ధమాడకుండా తెలివి తేటలతో దైవం పేరిట కట్టడి చేశారు.ఇంత చక్కటి పద్ధతి అది?!సరే! రాజులు అబద్ధమాడినట్లు తెలిస్తే వేసే శిక్షలు కూడా కట్టడి చేశాయి.అయినా రాజాస్థానాల్లో కొన్ని పరిస్థితుల్లో అబద్ధమాడినందుకు శిక్ష పడదు.అంత మాత్రాన ఆ వ్యక్తి శిక్ష నించి తప్పించుకున్నట్టు కాదు. దైవ సన్నిధిలో శిక్ష అనుభవించాల్సిందే! అందుకోసం ప్రాయశ్చిత్తం చేసుకోవాలి.ఇన్ని చేసినా పాపం తొలిగితే తొలుగుతుంది-లేకుంటే లేదు! దీని వల్ల ప్రాణంపోయినా అబద్ధమాడని పరిస్థితిలోనికి మనుష్యులను తీసికెళ్లారు. అందువల్ల నిక్కచ్చిగా వున్న వేదాలు మార్పు చేర్పులు లేకుండా నేటి దాకా వచ్చాయి.
పర మతస్థులను ఆదరించే సహన గుణం హిందువులకు వుంది. " సహనావవతు-సహనౌ భునక్తు-సహవీర్యం కరవావహై,తేజస్వినావధీతమస్తు,మా విద్విషావహై, ఓం శాంతిః,శాంతిః శాంతిః!!" అని చదువుతారు.హిందువులు పర మతాన్ని ఎందుకాదరించారంటే- ఎవరు ఏ విథంగా ప్రయత్నించినా , అన్ని మార్గాలూ దేవుని చేరేటందుకేననీ,ఇతర మతాల వారు చెప్పేదాంట్లో కూడా సత్యముందనీ-(సత్యం హిందువుకు దైవం.తాను అబద్ధ మాడడు కాన ఇతర మతానుయాయులూ అబద్ధాలాడరని నమ్మిక)అందువల్ల ఎవరేది దైవం విషయంలో చెప్పినా వారు నమ్మేస్తారు. దేవుని ఎక్కడైనా ఎప్పుడైనా ఏ రూపంలోనైనా చూడ గలమని వారు నమ్మిన కారణాన పరమతస్థులు చెప్పే మాటలపై కూడా వారికి నమ్మకం గురీ కుదిరాయి.పైగా పరమతాలను స్వీకరించిన హిందువులు వారి మార్గంలో పయనించి ఉన్నత శిఖరాలను అధిరోహించారు తమ వద్ద నున్న మనోనిశ్చలతతో!ఇదే విధంగా పర మతానుయాయులూ హిందూమతంలో ఆచరించే పద్ధతిలో పయనించి,ఉన్నత శిఖరాలనధిరోహించి మిగిలిన వారికి ఆదర్శ ప్రాయులయ్యారు. ఉ|| కబీరు,తుకారాం ముస్లిమ్ మతంలోని వారు. నేడు -హరే కృష్ణ అనుయాయులూ,సాయి భక్తులూ,రజనీష్ భక్తులూ ఇలా హిందూ వేదాంతుల వెనుక పడిన వారూ కనిపిస్తున్నారు. అలాగే హిందువులు కేరళ లోని సద్బ్రాహ్మణులు అనుకున్న వారు నంబూద్రులు కొందరు మొట్ట మొదటిగా క్రైస్తవ మతం స్వీకరించి ఆ మతానికి ప్రాచుర్యం కల్పించారు. హిందూ మతానికి ఫుల్ స్టాప్ లేదు. అందువల్ల అది విస్తరిస్తూ పోతోంది.మిగిలిన మతాలకి ఫుల్ స్టాప్ పెట్టి -వీడే దేవుడు! ఇలాగే మాగ్రంథంలో రాయబడి వుంది అని అలాగే ఫాలో అవాలి అన్న కారణంగా ఆ మతాలు ఎదరకు వెళ్లకుండా అక్కడితో ఆగిపోయి సంకుంచించుకు పోతున్నాయి. సత్యాన్వేషణకు హిందూ మతం వెసులుబాటు కల్పించిన కారణంగా ఎవరికి వారు ఎవరి పద్ధతిలో వారు దేవుని దర్శించే ప్రయత్నం చెయ్యాలి అనబట్టి వారి మతంలోనించి అనేక మతాలు కుప్ప తిప్పలుగా పుట్టుకొచ్చాయి.తమ మతం కాని దాన్ని సైతాను మతమనిగానీ,తమ మతాన్ని అనుసరించని వానిని చంపడమన్నదిగానీ వారు బోధించలేదు. అందువల్ల అన్ని మతాలకూ హైందవం తల్లి -తండ్రి గానీ అయింది.హైందవమ్నించి పుట్టిన మతాలు-బౌద్ధం,సిక్కిజమ్ ,పార్శీ మతం,జైనిజమ్ ,శాక్తేయం,శైవం,నారాయణీయం, ఇవన్నీ హైందవంలోంచే పుట్టాయి.క్రైస్తవంలో కేథలిక్కులూ-ప్రొటెస్టెంట్లూ,ఇలా విడినా వారు కొలిచే దైవం మారలా!ముస్లిమ్సు లో షియాలూ-సున్నీలూ అని ఎన్నో తేడాలున్నా వారి దైవం మారలా! కాని హిందూ దైవం రూపు రేఖలూ మార్చుకున్నాడు,వారి మతానుచారాలూ మారాయి హైందవం నించి పుట్టిన ఉప మతాల్లో!
To be continued-(ఇంకావుంది)